హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా పాత గోడ కూలింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హస్పిటల్కు తరలించారు.