Homeహైదరాబాద్latest NewsACCIDENT: కారు-బస్సు ఢీ.. ఐదుగురు మృతి..11 మందికి గాయాలు

ACCIDENT: కారు-బస్సు ఢీ.. ఐదుగురు మృతి..11 మందికి గాయాలు

మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుంది. సాంగ్లి జిల్లాలో కారు- బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన బీజాపుర్ గుహాగర్​ జాతీయ రహదారిపై జంబుల్​వాడి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img