ఇదే నిజం, ధర్మపురి టౌన్: మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల (58) చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్ల లో ఉత్తర ప్రదేశ్ కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతూ ప్రమీల మృతి చెందింది. ప్రమీలకు ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలనే భర్త గుండెపోటుతో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.