Homeజిల్లా వార్తలుకాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్​గా అహ్మద్ అలీ

కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్​గా అహ్మద్ అలీ

ఇదేనిజం, కరీంనగర్ టౌన్ : కాంగ్రెస్​ మైనార్టీ సెల్ ​నగర చైర్మన్​గా మహ్మద్​ అలీని నియమిస్తూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ లో ఎన్​ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కార్యకర్తగా కొనసాగుతూ మైనార్టీల సమస్యలపై అవగాహన కలిగి ఉండటం, పలు సందర్భాల్లో వారి సమస్యల కోసం కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల్లో క్రియాశీలక బాధ్యత వహించడం, పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగిన అహ్మద్ అలీకి ఈ బాధ్యత అప్పగించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే కవ్వంపల్లి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పురుమల్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్​కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img