Homeజిల్లా వార్తలుప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడ్స్ అవగాహన సదస్సు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడ్స్ అవగాహన సదస్సు

ఇదేనిజం, గొల్లపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి వుండాలని..అంటువ్యాధి కాదని పేర్కొన్నారు.అలాగే NACO సంస్థ ప్రతినిధి సమీరా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ఏవిదంగా సంక్రమిస్తుంది.సంక్రమించకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని నివారణ ఒకటే మార్గమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కె.సంతోష్ కుమార్,అధ్యాపకులు రమేష్,రాంప్రసాద్,లక్ష్మణ్,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img