Airtel : ఎయిర్టెల్ (Airtel) టెలికాం కంపెనీ తన వినియోగదారులకు సూపర్ఫాస్ట్ సేవలను అందిస్తుంది. ఎయిర్టెల్కు ఇప్పటికీ దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఎయిర్టెల్ తన కస్టమర్లకు 3 కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా 3 కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎయిర్టెల్ రూ. 355 రీఛార్జ్ డేటా ప్లాన్ : ఎయిర్టెల్ రూ. 355 ప్లాన్ అనేది ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ లాంటి అనుభవాన్ని అందించే ఎంట్రీ లెవల్ బల్క్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్లో 25GB హై స్పీడ్ బల్క్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా, ఎయిర్టెల్ రివార్డులలో 3 నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్ సబ్స్క్రిప్షన్ మరియు ఉచిత హలో ట్యూన్స్ ఉన్నాయి.
ఎయిర్టెల్ రూ. 589 రీఛార్జ్ డేటా ప్లాన్ : ఎయిర్టెల్ రూ.589 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ రోజుకు దాదాపు రూ.19 ఖర్చుతో 50GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 300 SMSలను అందిస్తుంది. డేటా కోటాను ఉపయోగించిన తర్వాత, ప్రతి MB వినియోగానికి 50 పైసలు చొప్పున టారిఫ్ వసూలు చేయబడుతుంది.
ఎయిర్టెల్ రూ. 609 రీఛార్జ్ డేటా ప్లాన్ : ఎయిర్టెల్ రూ.609 ప్రీపెయిడ్ ప్లాన్ అగ్రశ్రేణి ఎంపిక. ఈ ప్లాన్ రోజుకు దాదాపు రూ.20 ఖర్చుతో 60GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 300 SMSలను అందిస్తుంది. కోటా తర్వాత డేటా వినియోగానికి MBకి రూ.50 పైసలు వసూలు చేస్తారు.