తెలుగు సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. తాజాగా పెళ్లి పనులు కూడా ఇప్పుడే మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ పెట్టిన .. శోభిత రెడ్ అండ్ బ్రౌన్ సిల్క్ చీరలో అందంగా తయారయింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. రీసెంట్గా శోభితతో కలిసి లిఫ్ట్ లో ఉన్న ఫోటోను నాగ చైతన్య షేర్ చేసారు.