దేశంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో పరిస్థితేంటోనన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ఐక్యరాజ్యసమతి వాతావరణ విభాగం ముందే చెప్పింది. గతేడాది మొదలైన ఎల్నినోయే దీనికి కారణమని వివరించింది. ‘పసిఫిక్’పై ఉష్ణోగ్రతలు పెరగడమే ఎల్నినో. అయితే మే చివరికల్లా వానలు వచ్చేస్తాయని నిపుణులు చెబుతుండటం కొంచెం ఊరట కలిగిస్తుంది.