న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు సిద్దమవుతున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా.. అతివేగంతో వాహనాలు దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు.