తిరుపతిని ప్రతిరోజు లక్షాంత మంది భక్తులు సందర్శిస్తారు. శ్రీనివాసుని దర్శనం కోసం మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.వైకుంఠ ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలో..కొత్తగా..వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మార్చి నెలలో శ్రీవాణి, ఎస్ఈడీ కోటలో దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అదేవిధంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శన ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి నెలలో శ్రీవారి, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటా విడుదల తేదీలలో మార్పును గమనించాలని టీటీడీ నోటిఫికేషన్లో అభ్యర్థించింది. మార్చి నెల టిక్కెట్ కోటా డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది.ఆ తర్వాత.. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని హాస్టల్ గదుల కోటాను విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం భక్తులు టీటీడీ వెబ్సైట్.. https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించినట్లు తెలిసింది.