జార్ఖండ్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్లో కేసుల నిర్ధారణ అవ్వడం కోళ్లతో సహా 4000 వివిధ రకాల పక్షులను చంపేశారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. బర్డ్ ఫ్లూ కనిపించిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది.