ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. నేటితో ముగియనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు పేర్కొంది. డిసెంబర్ 3వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. రూ.100 అదనపు ఫీజుతో DEC 4-10, రూ.500తో DEC 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో DEC 25 నుంచి జనవరి 2వరకు చెల్లించవచ్చని తెలిపారు.