డాక్టర్ అయ్యేందుకు తన కుమార్తె ఎంతో శ్రమించిందని బెంగాల్ బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ చదువే లోకంగా నా కుమార్తె బతికింది. కానీ, ఒక్కరాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి. విధుల నిర్వహణకు వెళ్లిన ఆమెను.. ఆస్పత్రి విగతజీవిగా అప్పగించింది’’ అని ఆయన వాపోయారు.