Homeహైదరాబాద్latest Newsఎన్నికలకు అంతా రెడీ..ప్రముఖ అభ్యర్థులు వీరే

ఎన్నికలకు అంతా రెడీ..ప్రముఖ అభ్యర్థులు వీరే

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు ఒక పండగ. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా..ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశలో భాగంగా సోమవారం (మే 13) న తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు.


రాష్ట్రంలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 2.02 కోట్ల మంది పురుషులు కాగా.. 2.1 కోట్ల మంది మహిళలు, 3,421 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అలాగే, 68,185 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు.


రాష్ట్రంలో మొత్తంగా 1.06లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 3, 500 మంది కర్ణాటక పోలీసులు, 4500 మంది తమిళనాడు పోలీసులు, 1,614 మంది ఎక్స్‌సర్వీస్‌మెన్‌, 246 మంది విశ్రాంత పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.


తెలంగాణలో

17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కోసం 73 వేల మందికిపైగా పోలీసు బలగాలను మోహరించారు.

తెలుగు రాష్ట్రాల్లో

ఏపీ నుంచి

పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఏపీలో అసెంబ్లీ బరిలో తెదేపా అధినేత చంద్రబాబు (కుప్పం), వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ (పులివెందుల), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (పిఠాపురం), నారా లోకేశ్‌ (మంగళగిరి), బాలకృష్ణ (హిందూపురం), జైభారత్‌ పార్టీ చీఫ్‌ వీవీ లక్ష్మీనారాయణ (విశాఖ నార్త్‌), జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (తెనాలి), సుజనా చౌదరి (విజయవాడ పశ్చిమ), నారాయణ (నెల్లూరు పట్టణం), రఘురామకృష్ణరాజు (ఉండి), సత్తెనపల్లి (కన్నా లక్ష్మీనారాయణ) పోటీ చేస్తుండగా.. లోక్‌సభ బరిలో ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (కడప), భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (రాజమహేంద్రవరం), మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి (రాజంపేట), భాజపా నేత సీఎం రమేశ్‌ (అనకాపల్లి), ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (విశాఖ) బరిలో ఉన్నారు.

తెలంగాణ నుంచి


తెలంగాణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌), భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (కరీంనగర్‌), మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (మల్కాజిగిరి), కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ (సికింద్రాబాద్‌), ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ (హైదరాబాద్‌), భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ (నాగర్‌కర్నూల్‌), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) నుంచి పోటీ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img