పసికూన చేతిలో ఓడిపోవడంతో పాక్ క్రికెటర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓటమికి పాక్ బ్యాట్స్మెన్లే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పటికే యూఎస్ఏ చేతిలో ఓడి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ ‘బాల్ ట్యాంపరింగ్’ చేసేందుకు ప్రయత్నించాడని యూఎస్ఏ సీనియర్ క్రికెటర్ రస్టీ థెరాన్ ఐసీసీ తలుపు తట్టాడు. తమ జట్టుతో జరిగిన మ్యాచ్లో రవూఫ్ బంతి రూపు రేఖలను మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు.