సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని అల్లు అర్జున్ని కోర్టు ఆదేశించింది. దీంతో బెయిల్ పూచీకత్తు సమర్పించేందుకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. జడ్జి సమక్షంలో పూచీకత్తుపై అల్లు అర్జున్ సంతకం చేయనున్నారు. ఈ ఘటనలో నిన్న అల్లు అర్జున్కి షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.