Homeహైదరాబాద్latest Newsరోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలోగుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పీ యస్ పరిధిలో జరిగింది. మంగళవారం తెల్లావారుజామున మియాపూర్ నుండి కూకట్ పల్లి కి వెళ్ళే ప్రధాన రహదారి పిల్లర్ నంబర్ 622 వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొట్టి వెళ్లడంతో వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో తో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతి చెందిన వ్యక్తి వివరాలతో పాటు సీసీటీవీ పుటేజిని  పరిశీలిస్తున్నారు. మియాపూర్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img