అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. సముద్రంలో 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో 4 రోజుల పాటు గ్రాండ్గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. ఈ షిప్ లో మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్, ధోనీ వంటి సెలబ్రిటీలు ఉన్నారని తెలుస్తోంది. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారని తెలుస్తుంది. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్కి సంబందించిన ఓ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.