కొద్దిరోజుల్లో హైదరాబాద్ లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్మొదటి వారంలో సీఎం రేవంత్రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్పనులు 2021లో ప్రారంభం కాగా, గతేడాది నుంచి స్పీడప్చేశారు. అంచనా వ్యయం రూ.636.80 కోట్లు కాగా, పూర్తయ్యే సరికి రూ.736 కోట్లకు చేరింది.