Homeహైదరాబాద్latest News''మైత్రీ మూవీ మేకర్స్'' నిర్మాతలపై మరో కేసు నమోదు.. ఈసారి..!

”మైత్రీ మూవీ మేకర్స్” నిర్మాతలపై మరో కేసు నమోదు.. ఈసారి..!

ప్రముఖ తెలుగు ”మైత్రీ మూవీ మేకర్స్” నిర్మాతలపై మరో కేసు నమోదైంది. ఈ నిర్మాతలు ప్రస్తుతం ‘జై హనుమాన్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, కన్నడ హీరో రిషబ్ శట్టి లపై నాంపల్లి క్రిమినల్ కోర్టులోన్యాయవాది మామిడాల తిరుమల్ రావు కేసు దాఖలు చేసారు. ‘జై హనుమాన్’ సినిమా టీజర్ హనుమంతుడిని కించపరిచే విధంగా ఉందని.. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన ఈ టీజర్ లో హనుమంతుని ముఖచిత్రం బదులు కన్నడ హీరో రిషబ్ శెట్టి మొహం చూపించారని అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది మామిడాల తిరుమల్ రావు దాఖలు చేసారు. భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని.. హిందువుల మనోభావాలను దెబ్బతింటాయన్నారు అని పేర్కొన్నారు. దీనికి బాధ్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై న్యాయవాది ఫిర్యాదు చేసాడు.

Recent

- Advertisment -spot_img