మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు.