Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. ఈ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె. మురళీమోహన్, కె. వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంటకరెడ్డి,యునిసెఫ్ విద్యా నిపుణుడు కెఎం శేషగిరి లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తాజాగా విద్యా కమిషన్‌కు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ తెలంగాణలో విద్యావ్యవస్థపై విద్యా కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇస్తుంది.

Recent

- Advertisment -spot_img