న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శామీర్ పెట్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. జేబీఎస్ నుండి శామీర్ పెట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ -2 ‘బి’ లో భాగంగా డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు.