బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తెల్లవారు జామున రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే రానున్న మూడు గంటల్లో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.