అండమాన్ సముద్రం దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారానికి తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ చెప్పింది. గాలి వేగం కూడా ఎక్కువే. అంటే.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 17, 18 తేదీల్లో కోస్తాంధ్ర, ఏపీలోని రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే 15, 16, 17, 18 తేదీల్లో కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తాయని తెలిపారు. అలాగే 17, 18 తేదీల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.