భారత్తో యుద్ధ వాతావరణంలో ఉన్న పాకిస్థాన్కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి కారణంగా రాజధాని నగరమైన ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు అన్ని పెట్రోల్ బంక్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి రాబోయే 48 గంటల పాటు ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, ఇంధన కొరతను అధిగమించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలతో సతమతమవుతున్న వేళ, ఈ ఇంధన కొరత మరింత ఒత్తిడిని కలిగించనుంది. ఇస్లామాబాద్తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి సామాన్య ప్రజల రోజువారీ జీవనాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇంధన సంక్షోభం పాకిస్థాన్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.