భారత్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 240+ ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత సొంత మైదానంలో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2012లో 207 పరుగుల లీడ్ను ఇంగ్లాండ్ సాధించింది.