AP Cabinet : నేడు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఎల్-1 బిడ్డర్ కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.