ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం నేడు వాయిదా పడింది. అంతకుముందు వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులతో కలిసి నివాళులర్పించారు. దీంతో ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే కాసేపట్లో ముంబై బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. రతన్ టాటా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు.