Homeహైదరాబాద్latest NewsAP Crime News : Pawan Kalyan తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా?

AP Crime News : Pawan Kalyan తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా?

– ట్రాక్టర్‌తో తొక్కించి చంపుతారా?
– తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూస్తారా?
– జనసేన అధినేత పవన్​ కల్యాణ్​


ఇదేనిజం, ఏపీ బ్యూరో: తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అంటూ జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ప్రశ్నించారు. తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దారుణమన్నారు. తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మహిళను వైసీపీ సర్పంచి అనుచరుడు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేసిన ఘటనపై పవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుంటారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి. గాలి పీల్చాలి అనే పరిస్థితి రావడం దారుణం’ అంటూ పవన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img