Homeహైదరాబాద్latest Newsఏపీ సత్యసాయి జిల్లా అత్యాచారం ఘటనలో.. కీలక పరిణామం

ఏపీ సత్యసాయి జిల్లా అత్యాచారం ఘటనలో.. కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. అర్ధరాత్రి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్త కోడళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. అయితే ఈ అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా.. హిందూపురంలోని త్యాగరాజ్ కాలనీకి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు.కాగా, గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img