ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు టాప్ మార్కులు వచ్చాయి. 1400 మందికి పైగా విద్యార్థులకు 590 ఆపైన మార్కులు వచ్చాయి. 1800 మంది 570+ మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 104 మందికి పైగా మార్కులు వచ్చాయి. ఈ సంవత్సరం అత్యధికంగా చరిత్రలోనే మొదటిసారిగా ఏలూరుకు చెందిన మనస్వికి 600కు 599 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే.