ఇదే నిజం దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున దేవరకొండ ఆర్డీవోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ సభ్యుడు యలమల గోపీచంద్ మాట్లాడుతూ దేవరకొండ, మల్లెపల్లిలో ఉన్నటువంటి పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండా వారి ఇష్టారాజ్యం ప్రవేట్ జూనియర్ కళాశాలలు నడిపిస్తున్నారు. దేవరకొండ నగరంలో పలు జూనియర్ కళాశాలలో అనుమతి లేకుండా నడిపిస్తున్నడంతో కళాశాలల ప్రిన్సిపల్ లు వాళ్ళ ఇష్టానుసారంగా ఏబీవీపీ నాయకులతో మాట్లాడుతూ అడగటానికి మీరెవరు నా ఇష్టం ఉన్నట్టు కళాశాలలో అడ్మిషన్స్ తీసుకుంటూ కళాశాల నడిపిస్తామంటూ విద్యార్థుల నాయకులతో మాట్లాడుతున్న యాజమాన్యాలు.. సదరు కళాశాలకు అనుమతి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి దేవరకొండ పట్టణంలో చూస్తున్నాం. భవిత జూనియర్ కాలేజ్, సత్యసాయి జూనియర్ కళాశాల ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అడ్మిషన్లు నిర్వహిస్తోంది. డి ఐ ఈ ఓ కి ఫోన్ చేసి మాట్లాడిన నాకేం సంబంధం లేదు నేనేం చేయలేను అంటూ మాట్లాడారు. ఏకంగా ఈ కళాశాలను షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకి ప్రతి సంవత్సరం అధికారులు అనుమతి ఇవ్వకుండా విద్యార్థులు ఫీజు కట్టే సమయంలో ప్రవేట్ యాజమాన్యాలతో కుమ్మకై డబ్బులు తీసుకుంటూ అమ్ముడుపోతున్న విద్యాధికారులు అనుమతులు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కళాశాలలో ఫైర్ సేఫ్టీ, అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. కింద షాపింగ్ కాంప్లెక్స్ పైన గృహాల సముదాయం, సత్యసాయి జూనియర్ కళాశాల కాంప్లెక్స్ లో ఫంక్షన్ హాల్ ఉండడంతో నిబంధనల ప్రకారం ఈ కళాశాలకు అనుమతి ఇవ్వడం సాధ్యమే కాదు. దేవరకొండ పట్టణంలో సత్యసాయి జూనియర్ కళాశాల, భవిత జూనియర్ కళాశాల, గాయత్రి ఒకేషనల్ జూనియర్ కళాశాల, కొండమల్లేపల్లి పట్టణంలో సాయి ప్రకర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటూ కళాశాలలో నడిపిస్తున్నారు. ఈ ఒక్క అనుమతులు లేకుండా నడిపిస్తున్న కళాశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ దామోజు అమితేష్, సైదులు, సిద్దు, పవన్, చరణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.