- తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ సూచించింది
- ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి
- ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి
- కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి
- ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.