Homeక్రైంప్రియుడితో గొడవ.. బావిలో దూకి యువతి ఆత్మహత్య

ప్రియుడితో గొడవ.. బావిలో దూకి యువతి ఆత్మహత్య

ఇదే నిజం, మరిపెడ: ప్రియుడితో గొడవపడిన ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలం మూలమర్రి తండాలో చోటు చేసుకున్నది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. మూలమర్రితండా పరిధిలోని తోప్ల తండాకు చెందిన బానోత్ శ్రీను రెండో కూతురు చామంతి(21) తానంచర్ల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. ఇక ఏడాది క్రితం వాసు, చామంతి మనస్ఫర్థలు వచ్చాయి. అప్పట్లోనే పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. దీంతో చామంతి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నది.

Recent

- Advertisment -spot_img