భారత స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ జట్టు సమతూకం పేరుతో అతడిని పక్కన పెట్టిందని పేర్కొన్నాడు. క్రికెట్ అనేది బ్యాటర్ల గేమ్గా మారిందని, టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు సాధించిన అశ్విన్కు ఆల్రౌండర్గా తగినంత గుర్తింపు దక్కలేదన్నాడు.