Homeక్రైంమహిళపై దాడి..గొలుసు చోరీ

మహిళపై దాడి..గొలుసు చోరీ

ఇదేనిజం, మల్కాజిగిరి : ఓ మహిళపై గుర్తు తెలియని యువకులు దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన మల్కాజిగిరి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పీవీఎన్‌ కాలనీకి చెందిన కవిత అనే మహిళ తన కుమారులతో కలిసి బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వారిపై విచక్షణరహితంగా దాడిచేశారు. ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img