Homeఅంతర్జాతీయంమూడు రోజులు ఏటీఎంలు బంద్.. క్లారిటీ వచ్చేసింది..!

మూడు రోజులు ఏటీఎంలు బంద్.. క్లారిటీ వచ్చేసింది..!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇండియాలో మూడు రోజులపాటు ఏటీఎంలు మూసివేస్తారన్న వైరల్ వాట్సాప్ సందేశం పూర్తిగా ఫేక్ అని భారత ప్రభుత్వ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగానే సాధారణంగా పనిచేస్తాయని, అనధికార సందేశాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
ప్రజలు అధికారిక వనరుల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనధికార సందేశాలను షేర్ చేయడం మానుకోవాలని PIB సూచిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సరైన సమాచారం కీలకం, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది.

Recent

- Advertisment -spot_img