రాజస్థాన్లోని దుంగార్పూర్లో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త, కుమార్తెతో కలిసి గత ఆరేళ్లుగా ఓ అపార్ట్మెంట్లోని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి.. కత్తితో బెదిరించి ఏడాదిన్నర కుమార్తె ఎదుటనే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.