Homeజిల్లా వార్తలుముస్తాబాద్ లో దారుణం.. స్కూల్ వ్యాన్ చక్రాల కింద నలిగి నర్సరీ చదువుతున్న చిన్నారి మృతి..!

ముస్తాబాద్ లో దారుణం.. స్కూల్ వ్యాన్ చక్రాల కింద నలిగి నర్సరీ చదువుతున్న చిన్నారి మృతి..!

  • స్కూల్ వ్యాన్ కింద పడి నర్సరీ చదువుతున్న చిన్నారి మృతి.
  • టైర్ కింద పడడంతో చితికిపోయిన మెదడు.
  • శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.
  • డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్టానికుల ఆరోపణ.

ఇదేనిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ పసి పాప ప్రాణం పోయింది. ముస్తాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో నర్సరీ చదువుతున్న మనోజ్ఞ (3) స్కూల్ వ్యాన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. తల టైర్ కింద పడడంతో మెదడు చితికిపోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నరు. చనిపోయిన మనోజ్ఞ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img