Homeహైదరాబాద్latest Newsదారుణం.. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన త‌ల్లి!

దారుణం.. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన త‌ల్లి!

క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా అమాన‌వీయ ఘటన చోటు చేసుకుంది. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసింది ఓ త‌ల్లి.. పుట్టిన బిడ్డ కోసం దంపతుల మధ్య గొడవ జరిగింది. దివ్యాంగుడికి భార్య జన్మనివ్వడంపై భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. మూగబిడ్డకు జన్మనివ్వడంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. భార్యను నిత్యం వేధింపులకు గురి చేశాడు. మూగ పిల్లాడిని ఎక్కడైనా వదిలిపెట్టాలని భార్యను హింసించేవాడు. అయితే భర్త పెట్టే చిత్రహింసలను ఆ భార్య తట్టుకోలేక మెుసల్లి నదిలో కొడుకును వదిలేసింది.

ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పుట్టు మూగ. రెండో కుమారుడు బాగానే ఉన్నాడు. పెద్ద కుమారుడు మూగబ్బాయి కావడంతో ఆ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. మూగపిల్లాడికి జన్మనిచ్చావంటూ భర్త భార్యను నిత్యం వేధించేవాడు. కన్నతల్లి కాబట్టి ఆ పేగు బంధం కుమారుడిని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఆదివారం కూడా భార్యభర్తల మధ్య మళ్లీ మూగ బాలుడి విషయంలో గొడవ జరిగింది. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ తల్లి మూగబాలుడిని మెుసళ్లు ఉండే నదిలోకి విసిరేసింది. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Recent

- Advertisment -spot_img