Homeజిల్లా వార్తలుకామారెడ్డి జిల్లాలో దారుణం.. పురోహితుడిపై దాడి

కామారెడ్డి జిల్లాలో దారుణం.. పురోహితుడిపై దాడి

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బస్సుకోసం వేచి చూస్తున్న ఓ పురోహితుడిపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. ఈ ఘటన నిజాంసాగర్ లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డికి చెందిన పురోహితుడు బద్రీనాథ్(21) హైదరాబాద్ లో ఉంటున్నాడు. దసరా కోసం ఇటీవల ఎల్లారెడ్డికి వచ్చాడు. పని నిమిత్తం బీదర్ కు వెళ్లిన బద్రీనాథ్ శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణంలో నిజాంసాగర్ లో బస్సుకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో వర్గానికి చెందిన ఏడుగురు యువకులు బద్రీనాథ్ తో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి వాసులు పలువురు శనివారం ఉదయం తరలివచ్చారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కు బాధితుడికి స్థానిక పీహెచ్ సీలో చికిత్స చేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img