Homeతెలంగాణడీజీపీ కార్యలయం ముట్టడికి టీఎస్​ఏస్పీ అభ్యర్థుల యత్నం

డీజీపీ కార్యలయం ముట్టడికి టీఎస్​ఏస్పీ అభ్యర్థుల యత్నం

హైదరాబాద్​, ఇదేనిజం :​ పోలీసు విభాగంలోపి టీఎస్​ఎస్పీ ఉద్యోగాలకు సెలక్ట్​ అయిన అభ్యర్థులు మంగళవారం డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యలయానికి వచ్చిన పలువురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లడుతూ….. దాదాపు 9నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మాకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గువుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మాతోపాటు సమానంగా సెలక్ట్​ అయిన అభ్యర్థులకు (సివిల్​, ఏఆర్​, అభ్యుర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జితాలు ఇస్తున్నారని) కానీ టీఎస్​ఎస్​పీ, అభ్యర్థులకు మాత్రం ఇప్పటి వరకు శిక్షణకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదన్న అభ్యర్థులు, ఇప్పటికి చాలమంది సెలక్ట్ ​అయిన అభ్యర్థులు చనిపోయారని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కోన్నారు. వేంటనే డీజీపీ స్పందించి​ శిక్షణ తేదిని ప్రకటించి వేతనాలు ఇవ్వాలని అభ్యుర్థులు డిమాండ్​చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img