నాలుగో టెస్ట్ మ్యాచ్లో 7 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కోహ్లి, రోహిత్, రాహుల్ నిరాశ పరిచారు. సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్కు పంత్ అండగా నిలిచాడు. అతడు భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. జైస్వాల్ 84 వద్ద వెనుతిరిగాడు, ఆకాష్ దీప్ 2, సుందర్ 2 ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 198 పరుగులు అవసరం.