బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో భారత్ కీలకమైన జైస్వాల్, కోహ్లీ, ఆకాష్ దీప్ వికెట్లను కోల్పోయింది. అనవసర పరుగుకు యత్నించి యశస్వి జైస్వాల్ (82) రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ(36) బోలాండ్ వేసిన ఆఫ్సైడ్ బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆకాష్ దీప్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 5 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో 164 పరుగులు చేసింది. క్రీజులో పంత్, జడేజా ఉన్నారు.