Homeహైదరాబాద్latest Newsకారు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం

కారు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం

ఎండపల్లి, ఇదే నిజం: కారు ఢీకొని ఆటో డ్రైవర్​ ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకున్నది. ఆటో డ్రైవర్ బోగ లచ్చయ్య (55) అతని ఆటోను బస్టాండ్ వద్ద నిలిపి ఇంటికి వెళ్తుండగా.. రోడ్డుపై వస్తున్న కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లచ్చయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లచ్చయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుని మేనల్లుడు గాజుల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.

Recent

- Advertisment -spot_img