Balakrishna : నందమూరి బాలకృష్ణ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో స్వీకరించారు. బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో విశేష కృషి, కళా, సేవా, రాజకీయ రంగాల్లో చూపిన అద్భుతమైన ప్రతిభకు ఈ గౌరవం లభించింది.
తాజాగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కు చాలా నోటి దూల ఎక్కవ అని.. అతను స్టేజిపై ఏది పడితే అది మాట్లాడుతూ అని ఆరోపణలు చేసాడు. అసలు నోటి దూల బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దేనికి అంటూ గీతాకృష్ణ ఆరోపించారు. అయితే బాలకృష్ణ ఒకేసారి పద్మభూషణ్ అవార్డు నా కాలు గిటికి సమానం అని అన్నాడు.. ఎందుకంటే తన తోటి హీరోలు చిరంజీవి మిగతా హీరోలకు అందరికి అవార్డ్ లు వచ్చాయి. తనకి రాలేదు అనే కోపంతో బాలకృష్ణ ఆ మాట అన్నాడు అని చెప్పాడు. ప్రస్తుతం డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.