చైనాకు భారత్ దెబ్బ మీద దెబ్బ తీస్తూ వస్తుంది. కుయుక్తుల చైనాను ఆర్థికంగా దెబ్బ తీయడమే సరైన సమాదానం అని భావిస్తుంది భారత ప్రభుత్వం. దీంతో చైనాకు చెందిన యాప్లతో పాటు అనేక వస్తువులను అనధికారికంగా ఇండియా మ్యాన్ చేస్తుంది. ప్రజలలో చైనా వస్తువుల కొనుగోలు కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే భారత చమురు కంపనీలు చైనాకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇకపై ఇతర దేశాల నుంచి దేశానికి చమురు దిగుమతి చేసుకునేందుకు చైనా షిప్పులను అద్దెకు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో ఇతర దేశాలకు చెందిన షిప్లను అద్దెకు తెచ్చుకోవాలని కంపనీలు భావిస్తున్నాయి. దీంతో అద్దె రూపంలో చైనా షిప్ సంస్థలకు భారీగా ఆదాయం గండి పడనుంది.