Homeఫ్లాష్ ఫ్లాష్Bandi sanjay:నాగర్ కర్నూల్ లో రేపు బీజేపీ నవ సంకల్ప సభ

Bandi sanjay:నాగర్ కర్నూల్ లో రేపు బీజేపీ నవ సంకల్ప సభ

పోలింగ్ బూత్ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్

Bandi sanjay: మహా జనసంపర్క్ అభియాన్’’లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ బహిరంగ సభకు హాజరై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ 9 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు ‘‘నవ సంకల్ప సభ‘‘ అని నామకరణం చేశారు. జడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటన్నరపాటు సభలోనే ఉంటారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివ్రుద్ది, సంక్షేమ పథకాలతోపాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ సభ ఏర్పాట్లపై నాగర్ కర్నూలు జిల్లాలోని పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చింది. రేపటి జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలన్నారు ఒకవైపు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో తెలుసన్నారు . రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే ఆదరిస్తూ వస్తున్నారని అన్నారు . కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారు. పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తప్పుడు ప్రచారాలతో కలిసి కుట్ర చేస్తూనే ఉన్నారు.

. ఈ తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త సభకు హాజరుకావడంతోపాటు తనతోపాటు ఒక్కో కార్యకర్త 50 మందిని తీసుకుని రావాలన్నారు. కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నారు

Recent

- Advertisment -spot_img