- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
bandi sanjay: ఇదే నిజం,న్యూస్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… తనను నమ్మి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. తెలంగాణలో రామరాజ్యం, మోడీరాజ్యం ఏర్పాటు కోసం కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు.